శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 31 జులై 2019 (22:42 IST)

న్యూ డేమోక్రసి దళ కమాండర్ లింగన్న ఎన్కౌంటర్

న్యూ డెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళానికి, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో న్యూ డెమోక్రసీ దళ కమాండర్ మృతి చెందగా దళానికి సంబంధించిన, ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గుండాల మండలంలో జరిగింది. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం అలగడ్డ సమీప అడవిలో పంది గుట్టమీద లింగన్న దళం గత మూడు రోజుల నుండి విశ్రాంతి తీసుకుంటోందన్న సమాచారం తెలిసిన పోలీస్ గ్రే హాండ దళాలు గుట్టను చుట్టుముట్టి లింగన్న దళంపై కాల్పులు జరపడంతో లింగన్న మృతి చెందాడు. ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా సంఘటనా స్థలానికి ప్రజలను, మీడియాను వెళ్లకుండా సుమారు రెండు గంటలపాటు అడ్డుకున్నారు. అనంతరం జనం గొడవ చేయగా పోలీసులు వదిలి పెట్టారు. జనమంత గుట్ట పైకి వెళ్లే లోగా గుట్ట వెనుక నుండి మృతదేహాన్ని కిందికి దించి వెళ్లిపోతున్న సమయంలో ప్రజల అడ్డుకోగా లింగన్న మృతదేహాన్ని వదిలిపెట్టి కొంతమంది పోలీసులు వెళ్లిపోయారు.

మరికొంతమంది ఆ మృతదేహాన్ని తీసుకోవడానికి రావడంతో ప్రజలు రాళ్లతో పోలీసులపై దాడి చేయగా కానిస్టేబుల్ గాయాలయ్యాయి. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.