శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 31 జులై 2019 (22:22 IST)

ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ విడుదల

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. రేపటి నుంచీ ఆగస్టు నెలాఖరు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల వివరాలను పరిశీలించనుంది. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకూ బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను తనిఖీ చేయనున్నారు.

అక్టోబర్ 15 వరకూ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఇతరత్రా ప్రక్రియలను కొనసాగించనున్నారు. అనంతరం ఈసీ ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేయనుంది. అభ్యంతరాలకు నవంబర్ నెలాఖరు వరకూ ఈసీ గడువు విధించింది.
 
ఈసీ షెడ్యూల్‌:
- ఆగస్టు 1 నుంచి 31 వరకూ ఓటర్ల జాబితా వెరిఫికేషన్
- సెప్టెంబర్ 1 నుంచి 30 వరకూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలన
- సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 వరకూ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు
- అక్టోబర్ 15న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల
- అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ అభ్యంతరాల స్వీకరణ
- నవంబర్ 2,3 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెయిన్‌లు
- డిసెంబర్ 15 కల్లా వినతుల పరిష్కారం
డిసెంబర్ 31న మార్పులు, కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లు చేర్చి..ఓటరు జాబితా ముద్రణ
- 2020 జనవరిలో తుది జాబితా విడుదల