సంబంధిత వార్తలు
- మౌంట్ యునాన్ పర్వతాన్ని తెలంగాణా కానిస్టేబుల్
- చంపేందు ప్లాన్ చేస్తున్నారు : అరె కొడుకుల్లారా ఖబర్దార్..? ఈటల వార్నింగ్
- కరీంనగర్లో కాల్పుల కలకలం : ఆస్తి వివాదంలో సోదరులపై కాల్పులు
- దేశంలో తమ 96వ అత్యాధునిక కేంద్రాన్ని కరీంనగర్లో ప్రారంభించిన ఇందిర ఐవీఎఫ్
- తుదిశ్వాస విడిచేంత వరకు కారులోనే ఉంటా : దానం నాగేందర్
తెరాస ధూంధాం కార్యక్రమం.. దివ్యాంగుడిపై తెరాస నేత దాష్టీకం
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో అధికార తెరాస ఆధ్వర్యంలో ధూంధాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు హాజరయ్యాడు. అయితే, ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న గెల్లు శ్రీనివాస్తో పాటూ ఎమ్మెల్యే హాజరయ్యారు.
సభ చాలా సీరియస్గా జరుగుతుంటే... రాజేష్ అనే దివ్యాంగుడు తనకు పింఛన్ రావడం లేదని నాయకులను కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే అతన్ని పోలీసులు, స్థానిక నాయకులు అడ్డుకున్నారు. సభ ముగిసిన తర్వాత దివ్యాంగుడు.. స్టేజిపైకి ఎక్కి తనకు పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదంటూ మైకులో అడిగాడు.
దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ మహేంద్రాచారి.. ఆగ్రహంతో ఊగిపోయి, స్టేజిపైకి ఎక్కి దివ్యాంగుడు రాజేష్ను కిందకు లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వారంతా ఆ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ ఇప్పించాల్సింది పోయి.. అడిగినవారిపై దాడి చేస్తారా.. అంటూ మండిపడ్డారు.
తర్వాతి కథనం