తెలంగాణ రాష్ట్రం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్లో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి సబితా రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తన గన్మెన్ ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, మంత్రికి భద్రతగా ఉన్న...