1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TS Minster KTR Responds about his Comments on Andhra Pradesh

ఏపీలో కరెంట్ - నీళ్లు లేవనే వ్యాఖ్యలు అన్యాపదేశంగా వచ్చాయి... మంత్రి కేటీఆర్

ktramarao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను కళ్లకు కట్టేలా తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవన్నారు. రోడ్లు అధ్వాన్నస్థితిలో ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలోని వైకాపా పాలకుల్లో కలకలం రేపాయి. ఏపీ మంత్రి మంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. దీంతో మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. 
 
క్రెడాయి ప్రాపర్టీ షోలో తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. ఏపీలోని తన స్నేహితులను తెలియకుండానే తన వ్యాఖ్యలతో కొంత బాధపెట్టి ఉండొచ్చన్నారు. అయితే, ఎవరినో కించపరచాలనే, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, అన్యాపదేశంగానే అవి తన నోటి వెంట వచ్చాయని తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్‌ను సోదరుడిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆహా.. ఏమి వినయం : వైవీఎస్ ముందు మోకరిల్లిన ఏపీ మంత్రి