సంబంధిత వార్తలు
- పాలిచ్చే తల్లులు బొప్పాయి తింటే మంచిదా?
- ఒకే యువకుడితో తల్లీకూతుళ్ళ అక్రమ సంబంధం, అది తెలిసిపోవడంతో?
- ఎంతకాలం భరిస్తాం.. కన్నకొడుకైనా ఫర్వాలేదు.. చంపేయండి.. ఓ తల్లి
- జూమ్ ఆన్లైన్ క్లాస్ జరుగుతుండగా... ఓ విద్యార్థిని తల్లిపై అలా జరిగింది..?
- మద్యం కోసం కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టేసిన తల్లి.. హైటెక్ నగరంలో..?
మహబూబ్ నగర్ జిల్లాలో మట్టి ఇల్లు కూలి తల్లి, ఇద్దరు పిల్లలు మరణం
మహబూబ్ నగగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఇంటి వద్ద మట్టి ఇల్లు కూలిన ఘటనలో తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందారు. జిల్లాలోని గంగేడు మండలంలోని పగిడ్యాల గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన జొన్నల శరణమ్మ(35), పెద్ద కుమార్తె భవానీ(13), చిన్న కుమార్తె వైశాలి(9)తో కలిసి ఇంట్లో నివసిస్తోంది.
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వారి మట్టి ఇల్లు పూర్తిగా నాని పోయింది. ఈ తెల్లవారు జామున వారు నిద్రిస్తున్నసమయంలో ఒక్కసారిగా కూలి వారిపై పడింది. ప్రమాదంలో తల్లి, కుమార్తెలు ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.