గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 12 జనవరి 2021 (11:27 IST)

అకారణంగా పక్షులు చచ్చి పడుతున్నాయా? అస్సలు తాకొద్దు, బర్డ్ ఫ్లూ అయి వుండొచ్చు

ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనావైరస్ భయంతో వణికిపోతున్నారు. దీనికితోడు ఇంగ్లాండు నుంచి కొత్త కరోనా కూడా వచ్చేసింది. ఇదిలావుంటే తాజాగా మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. బర్డ్ ఫ్లూ. ఈ వ్యాధి ఇప్పటికే 10 రాష్ట్రాల్లో వెలుగుచూసింది. ఎక్కడి పక్షులు అక్కడే గిలగిల కొట్టుకుని చచ్చిపోతున్నాయి. ఇలా అకారణంగా చనిపోతున్న పక్షులను చేతులతో ముట్టుకోవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
కాగా తాజాగా ఉత్తరాఖండ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారించబడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి చనిపోయిన 700 కాకుల నుంచి 8 నమూనాలను భోపాల్ మరియు బరేలీకి పంపారు. వాటిలో 2 నమూనాలు కోట్ద్వార్ నుండి మరియు డెహ్రాడూన్ నుండి ఒకటి బర్డ్ ఫ్లూని నిర్ధారించాయి. దీనితో అటవీ శాఖలో ప్రకంపనలు నెలకొన్నాయి. పక్షి ఫ్లూ విషయంలో ఉత్తరాఖండ్ అటవీ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
 
పక్షి ఎక్కడైనా చనిపోయినట్లు కనబడితే, దానిని తాకవద్దు, పాతిపెట్టడానికి లేదా కాల్చడానికి ప్రయత్నించవద్దని అటవీ శాఖను పశుసంవర్ధక శాఖ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అటవీ శాఖ బృందానికి తెలియజేస్తే చనిపోయిన పక్షి యొక్క నమూనాను తీసుకొని దానిని స్థలం నుండి తొలగిస్తుంది.