1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Janasena clarify Pawan Kalyan Campaign in Karnataka Elections

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ దూరం...

ఈనెల 12వ తేదీన కర్ణాటక శాసనసభ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, జేడీఎస్ తరపున ఆయన ప్రచారం చేస్తారంటూ వార్తలు గుప్పుమన

Janasena
ఈనెల 12వ తేదీన కర్ణాటక శాసనసభ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, జేడీఎస్ తరపున ఆయన ప్రచారం చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై జనసేన అధికారి ఒకరు మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పర్యటించాలన్న ఆలోచనలో లేరని స్పష్టం చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పార్టీ పటిష్టమే లక్ష్యంగా పర్యటన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి వున్నందునే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారని, అందువల్ల పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టిసారించారని ఆయన వెల్లడించారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఫేస్‌బుక్ సరికొత్త డేటింగ్ యాప్.. యువత ఎక్కువసేపు..?