శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (13:09 IST)

బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టే బ్రా: కేరళ సైంటిస్ట్‌కు నారీశక్తి అవార్డు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళ సైంటిస్ట్ నారీ శక్తి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టే బ్రాను కనుగొన్న ఆమెకు ఈ అవార్డు లభించింది. వివరాల్లోకి వెళితే.. కేరళ సైంటిస్ట్ డాక్టర్. ఎ. సీమా ఈ అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. సెన్సార్ అటాచ్డ్ బ్రాజర్‌ను కనుగొన్నారు. దీని సాయంతో బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టవచ్చు. 
 
త్రిసూర్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో ఆమె సైంటిస్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత మహిళా పురస్కారమైన నారీ శక్తి అవార్డును ఆమె అందుకున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డు కింద లక్ష రూపాయలను రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ ఆమెకు అందజేశారు. 
 
శరీర ఉష్ణోగ్రత ఆధారంగా సెన్సార్ టచ్‌తో కూడా ఈ బ్రా.. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టేస్తుంది. ఈ సెన్సార్ సైజ్ 1ఎమ్ఎమ్ లెంగ్త్‌, 1ఎమ్ఎమ్ విడ్త్, 1.5ఎమ్ఎమ్ డీప్‌ను కలిగివుంటుంది. దీన్ని సిస్టమ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా 2డీ పిక్చర్ల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే వీలుంటుంది. ఈ బ్రాలను ధరించిన 15 నుంచి 30 నిమిషాల్లోపు బ్రెస్ట్ క్యాన్సర్‌ వుందా లేదా అనేది తేలిపోతుంది. 
 
ఈ బ్రాలు రూ.200 నుంచి రూ.500ల వరకు పలుకుతున్నాయని సీమా వెల్లడించారు. ఇప్పటివరకు 117 మంది రోగులను ఈ బ్రా ద్వారా పరిశోధించడం జరిగిందని.. మలబార్ క్యాన్సర్ సెంటర్ ఈ పరీక్షల్లో విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ బ్రాలను ధరించడం ద్వారా రేడియేషన్, ప్రైవసీ భయం అక్కర్లేదని.. ఇంకా ఎలాంటి నొప్పి వుండదని సీమా వెల్లడించారు. 
 
ఈ బ్రాను రూపొందించడం ద్వారా సీమా నారీ శక్తి అవార్డును గెలుచుకోవడంతో పాటు అంతకుముందు ఆమె సైన్స్ ద్వారా మహిళల కోసం ఉపయోగపడే పరికరాలను కనుగొన్న కారణంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రూ.5లక్షల నగదుతో సత్కరించింది.