కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చైనా నుంచి భారీగా నిధులు వస్తున్నాయంటూ బీజేపీ నేతలు చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేతలు స్పందించారు. గత మార్చి నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన పీఎం కేర్స్ నిధికి చైనాకు చెందిన కంపెనీలు భారీ మొత్తంలో నిధులు విరాళంగా ఇచ్చాయని కాంగ్రెస్ ఆరోపించింది. పైగా, ఈ నిధికి విరాళాలు ఇచ్చిన చైనా కంపెనీల జాబితాను కాంగ్రెస్ పార్టీ తాజాగా బహిర్గతం...