బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 21 మే 2019 (13:51 IST)

మోదీ యోగ ఫోటోపై ట్విట్టర్లో ట్వింకిల్ ఖన్నా సెటైర్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారపర్వం ముగిసిన తర్వాత కేథార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో కర్రతో మోదీ దర్శనమిచ్చారు. అనంతరం స్థానికంగా ఓ పవిత్ర గుహకు కాలినడకన వెళ్లి అక్కడ కాసేపు ధ్యానం చేసుకున్నారు. యోగముద్రలో మోడి కూర్చొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచార్యం పొందాయి. 
 
వీటిపై అనేకమంది నెటిజన్లు పలురకాలుగా స్పందించారు. ఇదంతా ఒక ఎత్తయితే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా మోదీని ఉద్దేశిస్తూ వ్యగ్యంగా ఓ ఫోటోను ట్విట్టర్లో  పోస్టు చేసింది. ‘‘ఈమధ్య కాలంలో ఇంటర్నెట్‌లో ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫోటోలు ఎక్కువుగా కనపడుతున్నాయి. 
 
అందుకే నేను కూడా మెడిటేషన్ ఫోటో కోసం అనేక ఫోజులు ప్రయత్నిస్తున్నానని పేర్కొంది. ఈ ఫోటో షూట్ వెడ్డింగ్ షూట్ కంటే బాగుందని తనదైన శైలిలో విమర్శించింది. ట్వింకిల్ ఖన్నా ఇదివరకు చాలాసార్లు మోదీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.