సంబంధిత వార్తలు
- ట్రంప్ పరువు పోగొట్టుకుంటున్నాడా? గద్దెపై నుంచి గెంటివేతకు రంగం సిద్ధం?
- అమెరికా క్యాపిటల్పై దాడి.. నాడు బ్రిటీషర్లు.. నేడు ట్రంప్ ఫ్యాన్స్
- ట్రంప్ మద్దతుదారులతో అమెరికాలో హింస.. నలుగురు మృతి
- అడుగడుగునా ఆటంకాలు.. బైడెన్ ఎన్నికను అడ్డుకోవడమే వ్యూహం...
- అగ్రరాజ్యంలో రణరంగం : ట్రంప్కు షాకిచ్చిన ట్విట్టర్ .. మద్దతుదారుల కాల్పులు
అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు జో బైడెన్దే... ట్రంప్ ఇంటికెళ్లాల్సిందే...
గత యేడాది నవంబరు నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయభేరీ మోగించినట్టు అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. విజయానికి కావాల్సిన 270 వోట్లను బైడెన్ సాధించినట్టు కాంగ్రెస్ పేర్కొంది. క్యాపిటల్ బిల్డింగ్పై ట్రంప్ మద్దతుదారుల దాడితో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆధ్వర్యంలో రెండు సభలు సంయుక్తంగా సమావేశమై బైడెన్ విజయాన్ని ధృవీకరించాయి.
దీనికి కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం బెడెన్దే విజయమంటూ ప్రకటించింది. జనవరి 20న జో బెడెన్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణశ్వీకారం చేయనున్నారు. అధికార పీఠం వదిలిలేది లేదంటూ కల్లోలానికి కారణం అవుతున్న ట్రంప్కు ఈ పరిణామంతో భారీ షాక్ తగిలినట్టైంది. బైడెన్ వైట్ హౌస్కీ.. ట్రంప్ సొంత హౌస్కు వెళ్లడం ఖాయమైపోయింది.
కాగా, అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్ బిల్డింగ్పై డోనాల్డ్ ట్రంప్ మద్దతు దారులు దాడి చేయడంతో ఆసమయంలో అమెరికా చట్టసభల్లో ఉన్న సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. అమెరికా ఎగువ, దిగు సభల సమావేశాన్ని తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే.. పరిస్థితి అదుపులోకి వచ్చాక అమెరికా చట్టసభ సభ్యులు మరోసారి సమావేశమై బెడెన్ విజయాన్ని ధృవీకరించారు.
తర్వాతి కథనం
