1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Watch: Man Uses "Shortcut" To Change Railway Platforms, This Happens Next

రైలు ఢీకొన్నా.. ఆ వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు.. లక్ అంతే అదే! (video)

Man
Man
రైలు ఢీకొన్నా.. ఆ వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు. రైలు ఢీకొన్నా.. ప్రాణాలతో బయటపడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా అదృష్టవంతుడేనని కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భాగల్ పూర్‌లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను హడావుడిగా దాటుతూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. 
 
రైలు మొత్తం అతని మీదుగా వెళ్ళింది. కానీ అతను ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భాగల్ పూర్ స్టేషన్‌ పట్టాలపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ స్టేషన్‌‌లో ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ ఫామ్ నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ షార్ట్ కర్ట్ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. 
 
పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్ కదిలింది. దీంతో రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో పట్టాల కిందే వుండిపోయాడు. అతనిని చూసిన జనం షాకయ్యారు. రైలు దాటిన తర్వాత షాక్‌తో లేచి నిలబడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలో వున్న వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ హైవే మార్గం