సంబంధిత వార్తలు
- బీఎస్ఎన్ఎల్కు 1.37 కోట్ల మంది కొత్త కస్టమర్లు
- క్రెడిట్ - డెబిట్ కార్డులకు ఇకపై నెట్వర్క్.. మీకు నచ్చిన కార్డును ఎంచుకోవచ్చు...
- 10 మంది కస్టమర్లలో 9 మంది సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లను కోరుకుంటున్నారు, ఎక్కడ?
- మూడు కోట్ల మంది ఖాతాదారుల మైలురాయిని దాటిన బంధన్ బ్యాంక్
- భారతదేశంలో వినియోగదారులు- వారి కుటుంబసభ్యుల కోసం మొట్టమొదటిసారిగా మూవ్ ఆరోగ్య భీమా పథకం
దేశంలో కంప్యూటర్లు - ల్యాప్టాప్ల దిగుమతిపై నిషేధం...
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్లు, ల్యాప్టాప్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ కారణంగా ల్యాప్టాప్లు, కంప్యూటర్ల ధరలు పెరగనున్నాయి. ప్రధానంగా చైనా, కొరియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై నిషేధం పక్కాగా అమలు చేయనున్నారు.
ఒక వేళ విదేశాలకు చెందిన కంపెనీలు లేదా స్వదేశీ కంపెనీలు విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నిషేధం విధించిన దిగుమతుల్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సర్వర్లు, అల్ట్రా స్మాల్ కంప్యూటర్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు ఉన్నాయి. ఈ నిషేధ ఉత్తర్వులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేరిట జారీ అయ్యాయి. వీటిని హెచ్.ఎస్.ఎన్ కోడ్ 8471 కింద నిషేధం విధించారు.
తర్వాతి కథనం
