1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Your Life is more important than your Likes

లైకుల కంటే ప్రాణాలే ముఖ్యం.. ఈ వీడియో చూస్తే..? (Video)

Sea
Sea
లైకుల కోసం ప్రాణాలు తీసుకోవద్దని ఈ వీడియో ద్వారా గ్రహించాల్సిందే. ఈ  వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు అమ్మాయిలు సముద్రపు పెద్ద అలలో చిక్కుకున్నారు. సముద్రపు ఒడ్డున రాళ్లపై నిలబడి ప్రజలు అలలతో ఫోటోలు దిగుతున్నారు.
 
ఇంతలో ఇలాంటి ప్రమాదం జరిగింది, ఇది వారు జీవితాంతం మరచిపోలేరు. ఈ వీడియోను IPS దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతా నుండి షేర్ చేశారు. వర్షాకాలంలో బీచ్‌కి వెళ్లేముందు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే.
 
వైరల్ అవుతున్న వీడియోలో బీచ్‌లో వర్షం తర్వాత బలమైన అలలు వస్తున్నాయి. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వాతావరణాన్ని, అలలను ఆస్వాదిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి వచ్చిన కెరటం.. పర్యాటకులను సముద్రలోకి లాక్కెళ్లింది.  
 
ఈ వీడియోను ఐపీఎస్ దీపాంశు కబ్రా ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాతో షేర్ చేసిన వెంటనే, దీన్ని కొన్ని గంటల్లో 2.5 లక్షల మంది చూశారు, అయితే 9000 మందికి పైగా దీన్ని లైక్ చేసారు. 
 
ఇది ఒమన్‌లో జరిగిన ప్రమాదం. ఇందులో పర్యాటకులు అధిక ఆటుపోట్లకు గురయ్యారు. వీరిలో కొందరు మాత్రమే మరణించగా మరికొందరు గల్లంతయ్యారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వరదలో చిక్కుకున్న ఏనుగు, మావటి.. ఇలా బయటపడ్డారు.. వైరల్