గురువారం, 19 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2015 (12:23 IST)

ఘనంగా అంబేద్కర్ జయంతి... ప్రముఖుల నివాళి..!

దేశ వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం నాడు ఘనంగా జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
 
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు 
 
అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అనంతపురం జిల్లా మడకశిరలోను, టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉన్న అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా మడకశిరలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
 
మరో వైపు తెలంగాణలో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. అదేవిధంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ మధుసూదనాచారి పూలమాల వేసి నివాళులర్పించారు.