సంబంధిత వార్తలు
- విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్ పేలి ఒకరు మృతి.. మరో మహిళ..?
- eBike Explosion: ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
- ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 45 కిలోమీటర్ల బైక్ జర్నీ
- పాల్వంచలో విషాదం.. గ్యాస్ లీకై ముగ్గురి సజీవదహనం
- ఫాస్ట్ చార్జింగ్ కనెక్టర్ను తెరిచిన ఎథర్ ఎనర్జీ
చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్: బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి..
చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన శుక్రవారం కందుకూరు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఆరీఫ్ అనే వ్యక్తి 'ఎకోతేజా' అనే కంపెనీకి చెందిన విద్యుత్ బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని కొంతకాలం క్రితం రూ.80 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు.
శుక్రవారం కనిగిరి రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఓ చోట వద్ద వాహనానికి చార్జింగ్ పెట్టాడు. కొద్దిసేపటికే వాహనం బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి.
చుట్టుపక్కల వారు గమనించి వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. బ్యాటరీ పేలిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
