1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 19 ఆగస్టు 2021 (16:40 IST)

మూడో క‌న్నుగా పిలిచే... ఫోటోగ్ర‌ఫీకి 182 వసంతాలు!

క‌మాన్ రెడీ, స్ట‌డీ, స్మైల్... క్లిక్!

ఇదీ, ఫోటో తీసేట‌పుడు ఫోటోగ్రాఫ‌ర్ ప‌లికే మాట‌లు.

మూడో క‌న్నుగా పిలిచే ఫోటోగ్ర‌ఫీకి నేటికి 182 వ‌సంతాలు నిండాయి.

1839వ సంవత్సరంలో ఫొటోగ్రఫీ ఆవిష్కరణ జరిగింది. తరువాత క్రమంగా ప్రపంచ దేశాలు అన్నిటిలోకి ఈ ప్రక్రియ వ్యాపించటం మొద లైంది. ఇదే క్రమంలో మన దేశంలోకి కూడా ఫొటోగ్రఫీ ప్రవేశించింది. ఆధారాలని బట్టి సుమారు 1840లోనే మన దేశంలోకి ప్రవేశించినట్లు దాఖలాలు ఉన్నాయి.

ఆ రోజుల్లో మొట్ట మొదటి వ్యాపార సంస్థను ఎఫ్‌. స్వ్రాన్‌హోపర్‌ అనే కమర్షియల్‌ ఫొటోగ్రాఫరు ప్రారంభించాడు. కలకత్తాలో కేలోటైపు ఫొటోగ్రఫీ ప్రక్రియతో ఒక స్టూడియోను ప్రారంభించినట్లుగా ఋజువులున్నాయి. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. యజమాన్యాలు ఎన్నిమారినా ఆ స్టూడియో ఇప్పటికి నెంబ‌ర్ 8, చౌరంగీ రోడ్డు, కలకత్తాలో నిల్చి ఉంది. ఆ రోజుల్లోనే 1853లో రాయల్‌ ఫొటో గ్రాఫిక్‌ సొసైటీని ఇంగ్లాండులో స్థాపించారు.

1854లో ఫొటో గ్రాఫిక్‌ సొసైటీ ఆఫ్‌ బాంబే స్థాపించబడింది. మన దేశంలో ఇది మొట్టమొదటి ఫొటో క్లబ్బు. ఆ తర్వాత ఇది ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్‌ ఇండియాగా మార్పు చెందింది. ఇది ఇప్పటికీ ఫొటోగ్రఫీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1855లో ఈ క్లబ్బు మొట్ట మొదట ఫొటో ప్రదర్శనని ఏర్పాటు చేసింది. నేడు ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా ఫోటోగ్రాఫ‌ర్లకు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.