సంబంధిత వార్తలు
- మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?
- దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు ఉన్నాడా? కేటీఆర్ ప్రశ్న
- తెలంగాణలో వరి సాగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి? చేస్తోంది ఏంటి?- అభిప్రాయం
- సుచరిత అలకపాన్పు.. సీఎం జగన్తో భేటీ అవుతారా?
- రెండు రోజుల పాటు కడపలో సీఎం జగన్ పర్యటన
ఏపీ సర్కారుపై అచ్చెన్నాయుడు ఫైర్..
ఏపీ సర్కారుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి జనంపై మోయలేని భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.
టిక్కెట్ పై రూ.10 పెంచిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అని ఆయన అడిగారు. ప్రయాణికులపై భారం మోపనని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ వాడుతున్న డీజిల్ పై పన్నులు వెనక్కి తీసుకుని ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.
డీజిల్పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించాయని, ఏపీలో మాత్రం పెరుగుతోందన్నారు. డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే సీఎం జగన్ దిగిపోవాలన్నారు.
మద్యంపై రూ.12వేల కోట్లు దోచుకున్నారు. కరెంటు రేట్లు విపరీతంగా పెంచారు. దేశ చరిత్రలో ఇన్ని దొంగ పన్నులు ఎప్పుడూ చూడలేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
