1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. All Inter second year students passed.. Who failed in exam Andhra pradesh

ఆంధ్రప్రదేశ్‌: ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్

Inter second year
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతితో దాదాపు 6లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ కంపార్ట్‌మెంటల్‌లో ఉత్తీర్ణులైనట్లు మార్కుల జాబితాలో పేర్కొంటామని ఇంటర్‌బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ తెలిపారు. 
 
ఫెయిలయిన విద్యార్థులందరికీ కంపార్ట్‌మెంటల్‌లో పాస్ చేస్తున్నట్లు వి.రామకృష్ణ చెప్పారు. మార్చిలో జరిగిన ఫస్టియర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై, మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ కోరుకునేవారు 2021 మార్చి-ఏప్రిల్‌లో సెకండియర్‌ విద్యార్థులతో పాటు మళ్లీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కరోనా పుణ్యం.. ఇళ్ల కొనుగోలు 67 శాతానికి పడిపోయింది.. రియల్ ఎస్టేట్ కుదేలు