1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ap dy cm pawan kalyan key instruction on clean godavari

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

pawan kalyan
'స్వచ్ఛ గోదావరి- పవిత్ర పుష్కరాల' నేపథ్యంలో అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత గోదావరి, పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఆరు జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. మురుగురహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మురుగు నీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. 
 
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంజూరు చేసిన రూ.100 కోట్ల నుంచి కూడా నిధుల వినియోగించాలని ఆదేశించారు. రోజువారీ 104 మిలియన్ లీటర్ల మురుగునీరు జీవనదిని కలుషితం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్ల మురుగు నీరు గోదావరిలో కలుస్తోందని పేర్కొన్నారు. 
 
పారిశ్రామిక వ్యర్థాల్లో ఆంధ్ర పేపర్‌ మిల్లు వెదజల్లే రోజువారీ కాలుష్యమే 32 మిలియన్ లీటర్లు ఉంటుందన్నారు. నిత్యం గోదావరిలో కలిసే 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటికి అదనమన్నారు. పారిశ్రామిక కాలుష్య నివారణకు నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ద్వారా నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్‌కి కంట్రోల్ రూం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు