శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (17:34 IST)

ఏపీలో లాక్‌డౌన్ సడలింపు - మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా లాక్‌డౌన్ సడలించింది. కొన్ని రంగాల్లో ఈ లాక్డౌన్ సడలింపులో భాగంగా, అదనపు మార్గదర్శకాలు జారీచేసింది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్‌తో ఫోనులో మాట్లాడారు. అమిత్ షా సూచన మేరకు అదనపు మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మార్గదర్శకాల మేరకు ఆయా రంగాలకు సంబంధించిన పనులు చేసుకునేందుకు అనుమతి లభించింది.  
 
ఈ సూచనల మేరకు ఆర్థిక రంగం, వ్యవసాయ రంగం, ఉద్యాన పనులకు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్,  గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు, పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు, ఈ-కామర్స్ కంపెనీలు, వారి వాహనాలకు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, పుస్తక విక్రయ దుకాణాలు తెరిచేందుకు, కరోనా లక్షణాలు లేని వలస కార్మికులకు రాష్ట్ర పరిధిలోని సొంతూరులో పనిచేసుకోవచ్చు. మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి లభించింది.