1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Minister Devineni comments on KTR and Jagan

ఏపీ బిర్యానీ పేడ అన్నారు.. ఇప్పుడేమో జగన్‌తో చేతులు కలిపారా?

Andhra minister
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వందశాతం ఓడిపోతారని, వైకాపా చీఫ్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ బిర్యానీ పేడ అని, ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు రావన్న కేసీఆర్ నేడు వైఎస్ జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. 
 
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వందశాతం ఓడిపోతారని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్, మోదీ కలిసి ఆడుతున్న జగన్నాటకమిది. రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీ చుట్టూ 29 సార్లు తిప్పించుకుని ప్రస్తుతం అవినీతిపరుడు జగన్‌తో చేతులు కలుపుతారా అని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం కేసు వేస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ అవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ మంత్రి చేశారు. పోలవరం పూర్తికాకుండా ప్రతీనెల అడ్డంపడుతున్న టీఆర్ఎస్ నేతలు నీతులు చెప్పడం మానుకోవాలన్నారు.
తర్వాతి కథనం
వైఛీపీ మూకల దాడి.. సిగ్గుచేటు.. మహిళలపై కూడా?: నారా లోకేష్