జిల్లా కేంద్రమైన అనంతపురం నగరం అరవింద్ నగర్లో ఉంటున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం మంత్రిచ్చిన నిమ్మకాయ, తెల్ల ఆవాలు, పసుపు, కుంకుమ విసిరేయడం స్థానికంగా కలకలం రేపింది. కారులో వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యే కిటికీ వైపుగా మంత్రించిన సామాగ్రి విసిరేసినట్టు అక్కడ విధులు నిర్వహించే గన్మెన్లు వెల్లడించారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు వారు ప్రయత్నం చేయగా,...