సంబంధిత వార్తలు
- ఏపీ విద్యా మంత్రి సురేష్ అక్రమాస్తుల కేసు : తీర్పు రిజర్వు
- వివేకా హత్య కేసు.. మీడియా ప్రతినిధులకు సీబీఐ నోటీసులు
- కొనసాగుతున్న వివేకా హత్య కేసు : పులివెందుల కోర్టులో శంకర్ రెడ్డి?
- వైఎస్.వివేకా హత్య కేసులో టర్నింగ్ పాయింట్ : అతని అరెస్టుకు రంగం సిద్ధం
- ఊపిరి పీల్చుకున్న ఏపీ సీఎం జగన్.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఛార్జిషీట్ వేసేందుకు సీబీఐకి అనుమతి
విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో చార్జిషీటు వేసేందుకు సీబీఐ అనుమతి కోరింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేసింది. సుధాకర్ వ్యవహారంలో ఐదుగురు అధికారుల పాత్ర ఉందని సీబీఐ తేల్చింది.
అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఐదుగురు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో హైకోర్టు అంగీకరించింది.
కాగా కోవిడ్ సమయంలో ఆస్పత్రిలో గ్లౌజులు, మాస్కులు లేవని డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యానించడంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. అంతేకాదు సుధాకర్పై కేసు కూడా నమోదు అయింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆయనకు మానసిక పరిస్థితి బాగోలేదని విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.
బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో కేసును సీబీఐకు అప్పగించింది. కేసు విచారణలో ఉన్న సమయంలో సుధాకర్ గుండె పోటుతో మరణించారు.
తర్వాతి కథనం
