సంబంధిత వార్తలు
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలపై సీఎం జగన్ కొరడా...? రివర్స్ టెండర్లేనా?
- వీసా రావాలంటే అవన్నీ ఇవ్వాల్సిందే... ట్రంప్ లేటెస్ట్ షాక్...
- మెరిసే చర్మం కోసం చిట్కాలు...
- తాండవం చేస్తున్న నిరుద్యోగం.. 45 ఏళ్లలో ఈ పరిస్థితి లేదు.. ఒప్పేసుకున్న ఎన్డీయే
- మురళీమోహన్ వెన్నెముకకు శస్త్రచికిత్స... పరామర్శించిన మెగాస్టార్ దంపతులు
మరి తెలుగు పరిస్థితి ఏమిటి - రేవంత్ రెడ్డి
హిందీ భాషని దక్షిణాది రాష్ట్రాలలో నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చాలన్న కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేంద్రం వివరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.
ఇది తమ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని పేర్కొన్న ఆయన... దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగేననీ, మరి అలాంటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చగలరా? అని ప్రశ్నించారు.
పాలకుల నిర్లక్ష్యం కారణంగా రెండవ స్థానంలో ఉండిన తెలుగుభాష మూడోస్థానానికి పడిపోయిందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆక్రోశించారు.
తర్వాతి కథనం
