సంబంధిత వార్తలు
- తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు
- తిరుమల అద్భుతాలు.. కలియుగాంతంలో వెంకన్న అప్పు తీరుతుందట! నిజమేనా?
- తిరుమల పుణ్యక్షేత్రంపై గుడ్డు బిర్యానీ తింటారా..? తమిళ భక్తులకు వార్నింగ్ (video)
- తిరుమల ఆలయ అలంకరణ చేస్తుంటే చెరిపేస్తారా?: తితిదే అధికారులపై దాత సునీత ఆగ్రహం
- Chaganti : చాగంటి పర్యటనలో ఎటువంటి అగౌరవం జరగలేదు-టీటీడీ
తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి కలకలం : తితిదే అలెర్ట్
తిరుమల తిరుపతిలో మరోమారు చిరుతపులి కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం సర్కిల్లోని ఓ కొండపై గురువారం సాయంత్రం చిరుత కూర్చుని ఉండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. తమ సెల్ఫోన్లో వీడియో తీసుకుని తితిదే విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో వాహనదారులను, భక్తులను అధికారులు అప్రమత్తం చేశారు.
కాగా, గతంలో పలుమార్లు చిరుతపులి తిరుమల కొండల్లో కనిపించి కలకలం రేపిన విషయం తెల్సిందే. వైకాపా ప్రభుత్వంలో ఓ చిరుత పులి ఓ బాలికపై దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు రక్షణగా వైకాపా పాకలకులకు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో కూడిన చేతికర్రలను కూడా ఇచ్చింది. ఈ చర్య విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత కొంతకాలం చిరుతపులి హడావుడి కనిపించలేదు. ఇపుడు మళ్లీ కనిపించడంతో కలకలం చెలరేగింది. దీంతో కానినడకన తిరుమల వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా నడిచి వెళ్లరాదని, సమూహాలుగా వెళ్ళాలని సూచన చేసింది.
తర్వాతి కథనం
