మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 మే 2024 (17:51 IST)

లోన్ యాప్ వేధింపులు.. ఇంజనీరింగ్ విద్యార్థి కృష్ణానదిలో పడి ఆత్మహత్య

suicide
లోన్ యాప్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. 
 
అవ‌స‌రం ఉండ‌డంతో ఇంట్లో తెలియ‌కుండా ఓ లోన్ యాప్‌లో రూ.10వేలు రుణం తీసుకున్నాడు. అయితే యాప్ నిర్వాహ‌కులు అత‌డిని రూ. 1ల‌క్ష క‌ట్టాలంటూ వేధింపుల‌కు గురిచేశారు. 
 
ఇంట్లో ఈ విషయం చెప్పడానికి భయపడిన వంశీ ఇంటి నుంచి ఈ నెల 25న వెళ్లిపోయాడు. అనంత‌రం తాను చ‌నిపోతున్న‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు సందేశం పంపాడు. ఆ త‌ర్వాత నుంచి అత‌ని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. 
 
ఆందోళ‌న చెందిన కుటుంబీకులు రెండు రోజులుగా వంశీ కోసం గాలించారు. కృష్ణా న‌ది వద్ద అత‌ని మొబైల్ ఫోన్‌, బైక్‌, చెప్పుల‌ను గుర్తించిన పోలీసులు అందులో గాలింపు చర్యలు చేపట్టారు. 
 
అక్కడ వంశీ మృత‌దేహం దొరికింది. తండ్రి ఫిర్యాదు మేర‌కు తాడేప‌ల్లి పోలీసులు మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. అనంత‌రం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.