మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (12:24 IST)

ఆమెను విడిచి ఉండలేనంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం

పరాయి వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు.. ఆమెను విడిచి ఉండలేనంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పర

పరాయి వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు.. ఆమెను విడిచి ఉండలేనంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఊరువిడిచి పారిపోయారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు వారు తిరుపతిలో ఉన్నట్టు తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత లక్ష్మీనారాయణ బంధువులు 10 రోజుల క్రితం వారి ఇరువురిని స్వగ్రామానికి తీసుకువచ్చి వీడిదీసి, ఆ మహిళను భర్త వద్దకు చేర్చారు. పైగా, ఇది సరైన పద్ధతికాదని, త్వరలో వేరే అమ్మాయిని చూసి వివాహం చేస్తామని తల్లిదండ్రులు కూడా చెప్పారు. 
 
అయితే, ఆమెను విడిచి ఉండలేని చెప్పిన ఆ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడివున్న ఇరుగుపొరుగువారు లక్ష్మీనారాయణను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.