సంబంధిత వార్తలు
- శ్రీరెడ్డి ట్వీట్ మిస్ ఫైర్.. బుర్రతక్కువదానా అంటూ నెటిజన్ల ఫైర్
- జగన్ దాడిపై శ్రీరెడ్డి స్పందన.. బుర్ర తక్కువదానా అంటూ నెటిజన్లు ఫైర్
- జగన్పై దాడి చేసిన వ్యక్తికి.. పలువురితో వివాహేతర సంబంధాలున్నాయట..
- జగన్పై దాడి.. గవర్నర్ ఫోన్.. రోజా ఫైర్.. ఆ కత్తికి విషం పూసి ఉంటే పరిస్థితి ఏమిటి?
- సీబీఐ కాదు.. బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ : మమతా బెనర్జీ
జగన్పై దాడి కేసు విచారణ ముమ్మరం
ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన దాడిపై దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. నిందితుడు శ్రీనివాస్ రావు చెప్పినట్లుగా లేఖ రాసిన వ్యక్తితో పాటు మరొక వ్యక్తిని పోలీసులు విచారించారు.
నిందితుడి స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలోని అతడి బంధువులు, స్నేహితులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. దాడికి రెండ్రోజుల ముందే శ్రీనివాస్ కొత్త సిమ్ కొనుగోలు చేయడంతో దానికి సంబంధించిన ఫోన్కాల్స్పై దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు పనిచేసే రెస్టారెంట్ యజమానికి సైతం నోటీసులు జారీచేసి విచారణ చేశారు. ఈ దాడికి సంబంధించి శ్రీనివాస్ను ఎవరైనా ప్రలోభపెట్టారా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు గతంలో కొద్దిరోజులు దుబాయిలో పనిచేశాడని, ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత బెంగళూరులోని ఓ హోటల్లో పనిచేశాడని పోలీసులు తెలిపారు.
