1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (09:28 IST)

కొత్త స్కార్పియో వాహనాలను కొనుగోలు చేసిన జనసేన

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మహీంద్రా సంస్థకు చెంది స్కార్పియో వాహనాలను కొనుగులు చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయదశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 'యాత్ర' చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, జనసేన పార్టీ కొత్త వాహనాల్ని కొనుగోలు చేసింది.
 
మార్కెట్లో మంచి డిమాండ్ వున్న మహీంద్రా నుంచి కొత్త స్కార్పియోను జనసేన కొనుగోలు చేసింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం (మంగళగిరి)లో ఈ కొత్త వాహనాలు కొలువు దీరడంతో, వీటిని చూసేందుకు జనసైనికులు పోటీ పడుతున్నారు.   
 
పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక వాహనాలు ఎలాగూ వుంటాయి. జనసేన ముఖ్య నేతల కోసం ఈ వాహనాల్ని వినియోగిస్తారని తెలుస్తోంది.