సంబంధిత వార్తలు
- జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల
- కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)
- సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్
- జగన్కు పబ్లిసిటీ పిచ్చి పీక్కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి
- ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...
అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన మురికి వ్యాఖ్యల కేసులో అరెస్టయిన జర్నలిస్టు కృష్ణంరాజు పశ్చాత్తాపం చెందుతున్నారు. అమరావతి మహిళలందరికీ క్షమాపణలు చెబుతానని పోలీసుల వద్ద ప్రాధేయపడుతున్నాడు. మహిళలను ఉద్దేశించి కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగాను ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో పోలీసులు కష్టడీకి తీసుకుని విచారించారు.
శుక్రవారం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ జరిపారు. ఈ విచారణ ముగియడంతో మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేసి మళ్లీ గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలకు సారీ చెబుతానంటూ పోలీసుల వద్ద ప్రాధేయపడినట్టు సమాచారం.
తర్వాతి కథనం
