1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (16:46 IST)

సిరిమాను ఉత్సవాలు : ఏపీలో మద్యం దుకాణాలు మూసివేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 18, 19వ తేదీల్లో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న, సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. 
 
ఈ మేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో కార్పొరేషన్‌ పరిధిలోని ఉన్న, నగరానికి సమీపంలో గల మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు తెరవరాదని సూచించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
ఈ రెండు రోజుల పాటు సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని, నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘించి మద్యం దుకాణాలు లేదా బార్లను తెరిచివుంచే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమ ఆదేశాల్లో స్పష్టం చేశారు.