1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అతివేగం.. వినాయకుడి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ.. నుజ్జు నుజ్జు

Vinayaka
అతివేగం అనర్ధానికి దారితీస్తుందనే చెప్పాలి. ఏపీలోని కాకినాడలో స్థానిక వినాయకుడి ఆలయాన్ని వేగంగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆ ఆలయం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అలాగే ఆలయంలో నిద్రపోతున్న గ్రామస్థుడు లక్ష్మణరావు కూడా చనిపోయారని తెలిసింది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
 
డ్రైవర్ నిద్రమత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.