హైదరాబాదులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఫోన్ చూడొద్దని తల్లి మందలించడంతో?
Missing Sisters from Hyderabad Traced to Eluru
ఫోన్ ఎక్కువగా చూస్తున్నారనే కారణంతో తల్లి కోప్పడటంతో ముగ్గురు బాలికలు హైదరాబాద్లోని తమ నివాసం నుంచి ఎవరికీ చెప్పకుండా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చేరుకున్నారు. పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి వెంటనే ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అప్రమత్తమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్తో బాలికలను ఏలూరు రైల్వే స్టేషన్లో క్షేమంగా రక్షించారు.
