1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (14:22 IST)

ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు: నారా భువనేశ్వరి మాటలు నిజమే

వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లను అనవసరంగా ఏడిపించిన వాళ్లు వారి పాపాన వాళ్ళే పోతారన్న నారా భువనేశ్వరి మాటలు నిజమేనని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఆడవాళ్లను ఏడిపంచారని.. అందులో తాను కూడా ఉన్నానన్నారు. 
 
అంతాలా ఆడవాళ్లను ఏడిపించారు కాబట్టి చంద్రబాబుకి పాపం తగిలిందని గుర్తు చేశారు. సీఎంగా వున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆడవాళ్లను ఏడిపిస్తుంటే.. అప్పుడు మాట్లాడని భువనేశ్వరి, ఇప్పుడు చంద్రబాబు దొంగ ఏడుపులకు స్పందించడం ఏంటని రోజా ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని మీరు గుర్తించాలన్నారు. 
 
సీఎం జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పని చేస్తోందని రోజా అన్నారు. ఆడవాళ్లకు సముచిత స్థానం కల్పిస్తోందని.. మీ భర్త చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆడవాళ్లకు జరిగిన అన్యాయం గురించి మీరు ఎప్పుడూ మాట్లాడారా అని రోజా నిలదీశారు. ఒక మహిళగా.. ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరిపై తనకు అభిమానం ఉందన్నారు. అయితే నిజంగా ఏడు పాపం తగిలేది ఉంటే ముందుగా చంద్రబాబుకే తగిలేది అన్నారు.  
 
ఎమ్మార్వో వనజాక్షి పై దాడి, మహిళా పార్లమెంటుకు పిలిచి అవమానపరిచి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన.. ఇన్ని సందర్బాల్లో మహిళ బాఢిన విషయం నారా భువనేశ్వరికి తెలియదా అని ప్రశ్నించారు. ఆ రోజు కనిపించని భువనేశ్వరి.. ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్లు మాట్లాడితే నమ్మేవారు లేరన్నారు. 
 
మీ భర్త దొంగ ఏడ్పులు ఏడిస్తే ఇప్పుడు మీరు మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యను కూడా రోడ్డున పెడుతున్నారని రాష్ట్ర ప్రజలు గమనించారని రోజా ఆరోపించారు.