శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (20:13 IST)

కృష్ణాజిల్లాలో ఘోరం.. ప్రియుడి కోసం కన్నబిడ్డనే కడతేర్చిన మహిళ

కృష్ణాజిల్లాలో ఘోరం జరిగింది. రక్తం పంచుకుపట్టిన బిడ్డనే ప్రియుడితో కలిసి కడతేర్చిందో మహిళ. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును హతమార్చి, మృతదేహాన్ని మరో ప్రాంతంలో పూడ్చి పెట్టింది. వివరాల్లోకి వెళితే.. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లికి చెందిన ఉష రెండు నెలల క్రితం భర్తతో విడిపోయి ప్రియుడితో కలిసి ఉంటోంది. 
 
ఉష ఇద్దరి కుమారులు కూడా వారితోనే ఉంటున్నాడు. అయితే కొడుకు తమకు అడ్డంకిగా మారడంతో ఎలాగైనా కొడుకును అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. దీంతో ప్రియుడు శ్రీనుతో కలిసి చిన్న కొడుకును హతమార్చింది. 
 
ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తెలంగాణలోని కోదాడ వద్ద పూడ్చి పెట్టారు. అయితే వీరి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉషతో పాటు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరం చేసినట్లు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.