1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Mp vijayasai Reddy fires on chandra babu

ప్రపంచ యుద్ధాల కంటే కరోనా డేంజర్: ఎంపీ విజయసాయిరెడ్డి

Chandra babu
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై టిడిపి అసత్య ప్రచారాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడని... రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుందని ఎద్దవా చేశారు.
 
"కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధాల కంటే దారుణమైనది. పాకిస్తాన్, చైనాతో మనం జరిపిన పోరాటాల కంటే పెద్దది. ఆపత్కాలాల్లో ప్రజలను కాపడుకోవడానికి విభేదాలు మరిచి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలతో సహకరించడం చూశాం. ఎల్లో గ్యాంగు నుంచి అంత గొప్ప ఆలోచనను ఆశించలేం. 
 
కొన్ని బతుకులంతే. ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడు. రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుంది. ఉన్న పనల్లా ఇదే. నాల్రోజుల పాటు అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తే ఏ అర్థరాత్రో తనే ఆక్సిజన్ పైపులను కోసినా కోసొచ్చే నికృష్టుడు." అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
About Writer
సెల్వి