బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:56 IST)

రాజధానిలో కొనసాగుతున్న నిరసనలు

అమరావతికి మద్దతుగా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో రైతులు రైతుకూలీలు  చేస్తున్నా రిలే నిరసన దీక్షలు మంగళవారంకు 315వ రోజుకు చేరుకున్నాయి .
 
నిరసన కార్యక్రమంలో మాదల వెంకటేశ్వర రావు,బిందు కుసుమ,నాగలక్ష్మి పద్మ,లక్ష్మి   బుల్లిబ్బాయి,సతీష్, చిన్నబ్బాయి,రామస్వామి, కొoడలు, అరుణ, విష్ణు, రాంబాబు, జ్యోతి, ప్రసాద్, మోహన్ రావు, బాబు, సాంబశివ రావు తదితరులున్నారు
 
బేతపూడిలో రైతులు రైతుకూలీల నిరసన 
మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో  మూడు రాజధానులకు వ్యతిరేకంగా  అమరావతికి మద్దతుగా  అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్నా రిలే నిరసన దీక్షలు మంగళవారం కు 315 వ రోజుకు చేరుకున్నాయి.
 
ఈ సందర్భంగా రైతులు రైతుకూలీలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు
 
ఈ కార్యక్రమంలో అడపా కలవకోల్లు వరకృష్ణ తోట శ్రీనివాసరావు కోసూరి భీమయ్యా వాసా వెంకటేశ్వరరావు కలవకోల్లు గోపి  అడపా వెంకటేశ్వరరావు గైరుబోయిన సాంబశివరావు కర్నాటి కృష్ణ  గుంటూరు శ్రీను  కుర్రా శివయ్య  బేతపూడి యోహాను  శిరంసెట్టి దుర్గరావు  గైరుబోయిన బసవయ్య  కలువకోల్లు నరసింహస్వామి, జూటు దుర్గరావు బుర్రిసత్యన్నారాయన బేతపూడి శేషగిరిరావు యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.
 
పెనుమాకలో రైతుల నిరసన దీక్ష 
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 315 వ రోజు మంగళవారం నిర్వహించారు.
  
మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు. 
 
ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, కళ్ళం రాజశేఖర రెడ్డి,మన్నవ శ్రీనాద్, పఠాన్ జానీ ఖాన్ పలగాని సాంబశివరావు, గుంటక సాంబిరెడ్డి,ముప్పేర మాణిక్యాలరావు  ,షేక్ సాబ్ జాన్, పలగాని సుబ్బారావుమన్నవ సుబ్బారావు,మేకా సాంబిరెడ్డి, పలగాని కృష్ణ, గోగినేని నాగేశ్వరరావు తదితర రైతులు పాల్గొన్నారు.