మూడు ముక్కలాటలొద్దు పాలకులారా?..మా జీవితాల్తో ఆటలొద్దు పాలకులారా? అంటూ రాజధాని రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా ఒక ఉద్యమ గీతం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. 6.13 నిమిషాల నిడివితో ఉన్న గీతంలో అమరావతికి ప్రధాని శంకుస్థాపన నుంచి.. ప్రస్తుత పరిణామాల వరకూ ప్రస్తావించారు. రాజధాని మార్పుపేర మా బతుకులు బుగ్గిచేస్తే.. భూమిచ్చిన రైతన్నను ముంచాలని మీరు చూస్తే... ఊరుకోము మేమంతా పాలకులారా?..ఊరువాడ కదిలొస్తాం పాలకులారా? ఉప్పెనై లేచొస్తాం పాలకులారా? ఉద్యమమై...