సంబంధిత వార్తలు
- ఆర్బీఐ అనుమతిలోని లోన్ యాప్ల తాట తీయండి : సీఎం జగన్
- అమిత్ షా భద్రతలో లోపం... ఆంధ్రప్రదేశ్ ఎంపీ పీఏగా నటించిన వ్యక్తి అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్: కొత్త పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏమిటీ ఓపీఎస్, జీపీఎస్?
- ఏపీలోని ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ హెచ్చరిక
- నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా - టాప్50లో 8 మంది
ఏపీ ప్రభుత్వానికి మరో అవార్డు వచ్చిందా.. ఎందుకు.. ఎందులో?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో అవార్డు వచ్చింది. నీతి ఆయోగ్ సలహాదారు నేతృత్వంలోని జ్యూరీ ఏపీ ప్రభుత్వాన్ని మరో పురస్కారానికి ఎంపిక చేసింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధి విభాగంలో ఈ అవార్డు ఇచ్చింది.
నిజానికి గత కాలంగా ఏపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు అవార్డు వరించింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె.సిన్హా సారథ్యంలోని జ్యూరీ కమిటీ పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఏపీ సర్కారు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని జ్యూరీ సభ్యులు వెల్లడించారు. మరోవైపు, ఈ అవార్డును రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అందుకోనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ గవర్నర్, పోలీసింగ్ విభాగాల్లో ఏపీకి ఇప్పటికే అవార్డులు దక్కడం తెలిసిందే.
