శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2016 (14:20 IST)

రైల్ బడ్జెట్ 2016 : సురేశ్ ప్రభు ప్రసంగంలోని బడ్జెట్ హైలెట్స్

రైల్వే 2016-17 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సరిగ్గా 12 గంటలకు ఆయన ప్రసంగ పాఠాన్ని ప్రారంభించారు. ఈ ప్రసంగ పాఠంలోని హైలెట్స్‌ను పరిశీలిస్తే.... 
 
*  రైల్వే ఆదాయం పెంపుకోసం కొత్త మార్గాల అన్వేషణ
* చార్జీలు పెంచితేనే ఆదాయం అనే విధంగా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి
* ఇంధన సేకరణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించగలిగాం 
* డీజిల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఈ యేడాది కూడా భారీగా ఆదా చేయాలని లక్ష్యం
* 2008-14 నుంచి 8 శాతంగానే రైల్వే వృద్ధి అంచనాలు
* గతేడాది అంతకు రెండు రెట్లు ఎక్కువ వృద్ధి సాధించాం
* రూ.లక్షా 21 వేల కోట్లతో రైల్వే బడ్జెట్‌
* భారతీయులంతా గర్వపడే రైల్వే వ్యవస్థను అందించాలి 
* భద్రతా ప్రమాణాల పెంపునకు అత్యాధునిక సాంకేతికత
* రూపాయి ఖర్చుతో ఐదు రూపాయల వృద్ధి
* వచ్చే ఐదేళ్లలో రూ.1.5లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎల్ఐసీ
* రోజుకు 7 కి.మీ. రైల్వే లైన్ల నిర్మాణం
* 2017-18లో 9 వేల ఉద్యోగాల కల్పన
* వచ్చే ఏడాది 2 వేల కి.మీ. రైల్వే మార్గాలను విద్యుదీకరణ
* ఆదాయ లక్ష్యం రూ.1,84,820 కోట్లు
* 5,300 కి.మీ. 44 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంవోయూలు 
* అంతర్గత ఆడిట్‌ విభాగాన్ని బలోపేతం. లీకేజీలు అరికట్టేందుకు కృషి 
* ఈ యేడాది మరో 100కు పైగా రైళ్లలో ఆన్‌బోర్డ్‌ హౌస్‌కీపింగ్‌ సేవలు 
* 2015-16లో ఇంధన ఆదాతో రూ.8,720 కోట్లు మిగులుదల
* ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి డిస్పోజబుల్‌ బెడ్‌షీట్లు 
* కొత్తగా 74 రైళ్లలో ఆన్‌బోర్డ్‌ హౌస్‌ కీపింగ్‌ సేవలు
* ఆన్‌డిమాండ్‌పై రైల్వే రిజర్వేషన్లు అందించడం
* రవాణా రైల్వే టైంటేబుల్‌ను ఖచ్చితంగా అమలయ్యేలా చూడడం
* రైళ్ళ సమయపాలనను ఖచ్చితంగా అమలు చేయడం
* రవాణా రైళ్ల సగటు వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచడం, మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం 80 కిలోమీటర్లకు పెంచడం. 
* స్వర్ణ చతుర్భుజి మార్గంలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను నడపడం. 
* మానవ వ్యర్థాలను నేరుగా బయటకు పంపడాన్ని అరికట్టడం 
* చెన్నై కేంద్రంగా మొట్టమొదటి భారతీయ రైల్వే ఆటోహబ్‌ 
* వికలాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు 
* రాజధాని, శతాబ్ది రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు 
* 100 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు, రెండేళ్లలో మరో 400 స్టేషన్ల విస్తరణ 
* వచ్చే ఏడాది 2,800 కి.మీ. మేర కొత్త లైన్ల నిర్మాణం
* జమ్మూకాశ్మీర్‌ టన్నెల్‌ వర్క్స్‌ వేగవంతం 
* పెండింగ్‌ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి 
* నాన్‌ ఏసీ కోచ్‌లలోనూ డస్ట్‌బిన్లు 
* రూ.1300 కోట్లతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం 
* ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 లోయర్‌ బెర్తులు 
* పీపీపీ విధానంలో 400 స్టేషన్ల ఆధునికీకరణ