సంబంధిత వార్తలు
- ప్రధానమంత్రిని హత్య చేసేంత శక్తి వాళ్లకుందా? ఇమేజ్ కోసం పాకులాట... వరవరరావు
- ఎన్నికల దూరంగా హఫీజ్ పార్టీ.. మోదీని చంపేస్తారట.. అమెరికా, భారత్ దేశాల్లో?
- మోదీనా ఆయనెవరు.. అని అడుగుతున్న కెనడియన్లు..
- రాజీవ్ తరహాలో మోడీ హత్యకు భారీ కుట్ర.. ప్లాన్ ఎవరిదంటే?
- రాజీవ్ గాంధీ తరహాలోనే మోదీ హత్యకు మావోల కుట్ర..?
భవిష్యత్తులోనూ ధరల మంటే... సర్వేలో తేటతెల్లం
సుపరిపాలన అందిస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాలనా పగ్గాలు చేపట్టి నాలుగేళ్ళ పూర్తయింది. మరి, ఈ నాలుగేళ్లలో దేశంలో ధరలు మాత్రం గత పాలన కంటే అధికంగా ఉండ
సుపరిపాలన అందిస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాలనా పగ్గాలు చేపట్టి నాలుగేళ్ళ పూర్తయింది. మరి, ఈ నాలుగేళ్లలో దేశంలో ధరలు మాత్రం గత పాలన కంటే అధికంగా ఉండటం గమనార్హం. అయితే, ద్రవ్యోల్బణం గతంతో పోలిస్తే మెరుగుపడింది. కానీ, ధరల పరిస్థితి మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరగనుందని, దానితోపాటే ధరల మంట తప్పదని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం దిగజారిందని 2014 సర్వేలో 1.8 శాతం మంది అభిప్రాయపడితే... ఈసారి వారి సంఖ్య 7.3 శాతం.
భవిష్యత్తులో ఇంకా దారుణంగా ఉంటుందని అప్పట్లో 1.5 శాతం ఆందోళన వ్యక్తంచేస్తే.. ఇప్పుడు 5.5 శాతానికి పెరిగింది. ధరల పరిస్థితి మెరుగుపడిందని నాలుగేళ్ల కిందట 87.1 శాతం చెబితే... తాజా సర్వేలో వారి సంఖ్య 79.2 శాతం మాత్రమే.
