సంబంధిత వార్తలు
- తెలంగాణలో బుల్డోజర్ రాజకీయాలు.. హరీష్ రావు
- హైడ్రా కూల్చివేత కారణంగా మహిళ ఆత్మహత్య.. ఏపీ రంగనాథ్పై కేసు
- సైబరాబాద్ పోలీసులు సీరియస్.. శబ్ధ కాలుష్యం.. 17 పబ్లకు లైసెన్స్ లేదు..
- కలెక్టరేట్లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?
- మంత్ర తంత్రాలతో ఆరోగ్యం.. దొంగబాబా అరెస్ట్.. ఎక్కడంటే?
సికింద్రాబాద్ నుంచి అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర యాత్ర..9 రోజుల పర్యటన
భారతదేశపు అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను ప్రదర్శించడానికి భారతీయ రైల్వేలు ప్రారంభించిన భారత్ గౌరవ్ టూరిస్ట్ సర్క్యూట్ రైలు ప్రయాణికులలో భారీ విజయాన్ని సాధించింది. తాజాగా అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర యాత్రను శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
24వ భారత్ గౌరవ్ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎస్సీఆర్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె. పద్మజ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పుణ్యక్షేత్ర తొమ్మిది రోజుల పర్యటన గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్లోని తీర్థ స్థలాలను కవర్ చేస్తుంది.
అయోధ్య - కాశీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణీకులకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం కొత్తగా నిర్మించిన రామజన్మభూమి (అయోధ్య), జ్యోతిర్లింగాలలో ఒకటైన (కాశీ విశ్వనాథ దేవాలయం) దర్శనం చేసుకోవడానికి లేదా పిండ ప్రదాన ఆచారాలను చేయడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.
సికింద్రాబాద్తో పాటు, తెలంగాణలోని భోంగీర్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్, తుని, వైజాగ్ (పెందుర్తి)లలో ప్రయాణికుల కోసం డి-బోర్డింగ్ సౌకర్యం కల్పించబడింది.
