1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (20:24 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ - ఈ రోజు కేసులు ఎన్నంటే...

రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుంది. ముఖ్యంగా, ఏపీలో గత 24 గంటల్లో ఏకంగా 13,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 41,771 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగు చూశాయి. 
 
ఈ కేసుల్లో అత్యధికంగా కడప జిల్లాలో 2,031, కర్నూలులో 1,835, విశాఖపట్టణంలో 1,349, గుంటూరులో 1,342, ప్రకాశంలో 1,259, తూర్పుగోదావరిలో 1,066, నెల్లూరు జిల్లాలో 1,007 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నుంచి 10,290 మంది కోలుకోగా, 9 మంది మరణించారు. 
 
అదేవిధంగా తెలంగాణాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 97,549 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 3,944 మందికి ఈ వైరస్ సోకింది. 2,444 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,372, మేడ్జల్ మల్కాజిగిరి జిల్లాలో 288, రంగారెడ్డిలో 259, ఖమ్మంలో 135, సంగారెడ్డిలో 120, హన్మకొండలో 117, నిజామాబాద్ జిల్లాలో 105, సిద్ధిపేట జిల్లాలో 104, కొత్తగూడెం జిల్లాలో 101 చొప్పున కేసులు నమోదయ్యాయి.