1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Andhra pradesh : Tdp activist brutally murdered in kurnool

కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

murder
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అధికార టీడీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. మాసుంబాషా దర్గా సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ దారుణ హత్య జరిగింది. నగదు లావాదేవీ విషయంలో ఇంతియాజ్‌తో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఈ క్రమలో వివాదం తీవ్రమైన వారు రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వయసు 37 యేళ్లు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నా భర్తను ఏదొక యాక్సిడెంట్ చేయించి హత్య చేయి: ప్రియుడికి వివాహిత మెసేజ్