1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

శామిర్‌పేటలో విద్యార్థినిపై హెడ్మాస్టర్ అత్యాచారం...

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన శామిర్‌పేటలో పవిత్రమైన గురువు స్థానంలో ఉన్న ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామాంధుడుగా మారిపోయాడు. ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా స్కూల్‌కు వచ్చిన ఓ విద్యార్థినిని తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని శామిర్‌పేటకు చెందిన ఓ విద్యార్థిని (15) తొమ్మిదో తరగతి చదువుతుంది. ఈ నెల 22వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఆ విద్యార్థిని ముఖానికి మాస్క్ ధరించలేదు. ఆ సమయంలో ఆ బాలికను చూసిన హెడ్మాస్టర్ తన గదికి రావాలంటూ ఆదేశించాడు. దీంతో భయంతో వణికిపోతూ గదికి వెళ్లిన బాలికపై హెడ్మాస్టర్ లైంగికదాడికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, టీసీ ఇచ్చి పంపించి వేస్తానని హెచ్చరించడంతో ఆ బాలిక మిన్నకుండిపోయింది. 
 
ఈ క్రమంలో అదే స్కూల్‌లో హెచ్.ఎంగా పని చేసిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు బుధవారం ఆ స్కూల్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులంతా ఆ మహిళా ప్రధానోపాధ్యాయురాలిని కలుసుకున్నారు. అపుడు బాధిత బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని ఆమెకు చెప్పి బోరున విలపించింది. 
 
ఆ మహిళా హెచ్ఎం.. బాధిత బాలికకు అండగా నిలిచి, పోలీసుల ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... స్కూల్ హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బాలికకు వైద్య పరీక్షలు కూడా చేయించాలని నిర్ణయించారు.