1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జూన్ 2024 (09:21 IST)

గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతూ మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య!!

deadbody
గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని  మేడ్చల్‌ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన కొమరాజు కృష్ణసాయి, తన అక్క కొమరాజు సంగీత (24) చదువుకునేందుకు మేడ్చల్ రాఘవేంద్ర నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. 
 
సంగీత గ్రూపు 1, 4 పరీక్షలకు నాలుగు నెలలుగా సన్నద్ధమవుతుంది. పరీక్షల విషయంలో చాలా భయమేస్తుందని ఇటీవల తమ్ముడితో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అతడు బయటకు వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో అక్కకు ఫోన్ చేయగా ఆమె తీయలేదు. అనుమానం వెంటనే వచ్చి తలుపులు బద్ధలు కొట్టాడు. ఫ్యాన్‌‍కు ఉరేసుకుని మతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.