సంబంధిత వార్తలు
- మాధవీలత గట్టిపోటీ ఇచ్చినా మజ్లిస్కే గెలుపు.. ఏపీలో ఆ ముగ్గురు?
- ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. పదేళ్ల గడువు ఒక్క రోజులో..?
- గం..గం..గణేశా కథను మరోసారి చెప్పించుకుని ఎంజాయ్ చేశారు : దర్శకుడు ఉదయ్ శెట్టి
- జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్లోని శరత్ సిటీ మాల్లో అతిపెద్ద రిటైల్ స్టోర్ ప్రారంభం
- నువ్వే నా ప్రాణమని నమ్మించాడు... ఇదంతా నిజమని నమ్మా... కానీ అమ్మా...
గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతూ మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య!!
గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా నకిరేకల్కు చెందిన కొమరాజు కృష్ణసాయి, తన అక్క కొమరాజు సంగీత (24) చదువుకునేందుకు మేడ్చల్ రాఘవేంద్ర నగర్లో అద్దెకు ఉంటున్నారు.
సంగీత గ్రూపు 1, 4 పరీక్షలకు నాలుగు నెలలుగా సన్నద్ధమవుతుంది. పరీక్షల విషయంలో చాలా భయమేస్తుందని ఇటీవల తమ్ముడితో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అతడు బయటకు వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో అక్కకు ఫోన్ చేయగా ఆమె తీయలేదు. అనుమానం వెంటనే వచ్చి తలుపులు బద్ధలు కొట్టాడు. ఫ్యాన్కు ఉరేసుకుని మతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
