1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (14:12 IST)

టెన్త్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై హత్య

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులు బాలికను హత్య చేశారు. ఈ దారుణం జిల్లాలోని పూడురు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ ప్రాంతానికి చెందిన పదో తరగతి చదివే 15 యేళ్ళ బాలిక ఉదయం ఆరు గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లింది. ఆ తర్వాత ఆ బాలికను చెరబట్టిన కొందరు కామాంధులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. 
 
పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు.