1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Telangana: Mother kills two kids, ends life

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

murder
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఏమాత్రం కనికరం లేని కన్నతల్లి తన ఇద్దరు పిల్లలను నరికి చంపేసింది. నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‍‌ పరిధిలోని గాజులరామారంలో ఈ దారుణం జరిగింది. వేట కొడవలితో పిల్లలను నరికి చంపింది. ఆ తర్వాత ఆమె భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. చంపేసిన పిల్లల వయసు 7, 5 యేళ్ళుగా ఉంటాయని స్థానికులు తెలిపారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో కన్నతల్లి ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి 
 
హైదరాబాద్ నగరంలోని ఫతేనగర్ ఏరియాలోని హోమ్ వ్యాలీలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. మూగ జీవాల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించి, ఆ కుక్క పిల్లలను పట్టుకుని నేలకేసి కొట్టి రాక్షసానందం పొందాడు. అతని క్రూర చర్యలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో ఆ కిరాతకుడుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని దాని ఐదు పిల్లలను ఆ కిరాతకుడు చంపేశాడు. ఆ అపార్టుమెంట్‌లో ఉంటున్న వ్యాపారి అశిష్ ఈ దారుణానికి పాల్పడినట్టు సీసీటీవీ దృశ్యాల ద్వారా తేలింది. దీంతో అతనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఏమిటని ఇలాంటి వారిని కఠింగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల